మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించడం బాధాకరమైన విషయమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి నాయకుడిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగానే అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. సురేఖ కాంగ్రెస్లో కొనసాగితే భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ తెలిపారు.


