తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఆస్పత్రిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నిడదవోలు ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది. మందుల లభ్యత గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో రాత్రి పూట తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వాసుపత్రిపై ఫిర్యాదులు.. అర్ధరాత్రి మంత్రి ఆకస్మిక తనిఖీలు..
RELATED ARTICLES


