ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై మీడియా ముందుకు వచ్చారు. కొండా సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని, సీఎం రేవంత్రెడ్డికి ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గత విషయాలను రచ్చకెక్కించడం సరికాదని మరో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హితవు పలికారు.


