ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ మధ్యలోనే ఏడుగురు కీలక ఆటగాళ్లను తొలగించడంపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నోరు విప్పాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు బోర్డు తనను సంప్రదించలేదని చెప్పాడు. పత్రికల ద్వారానే తనకు కూడా విషయం తెలిసిందని బాబర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జ్వరం నుంచి కోలుకున్న తాను ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఆఖరి టెస్టులో జట్టును నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, వైట్వాష్ తప్పించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.


