బాలీవుడ్ను కుదిపేసిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఆరేళ్ల కిందట జూన్ 2020లో సుశాంత్ ముంబయిలోని తన ఫ్లాట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, దీనికి వారం రోజుల ముందే ఆయన మేనేజర్ దిశా ఓ అపార్ట్మెంట్ భవనం 14వ అంతస్తుపై నుంచి పడి చనిపోయారు. అయితే, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తాజాగా బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను, డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా మృతిపై సీబీఐ విచారణ.. బాంబే హైకోర్టు ఆదేశం
RELATED ARTICLES


