వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బొత్స మేనల్లుడు.. మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి ఇంఛార్జి పదవులు రాజీనామా చేసి, రాజీనామా లేఖను అధినేత జగన్కు పంపించిన చిన్న శ్రీను.. అనంతరం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కుమార్తె సహస్రతో పాటుగా పలువురు అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.


