అక్టోబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2018 బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు కునెమన్, నేసర్లకు కూడా స్థానం కల్పించారు.


