చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీని.. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ స్లెడ్జింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచులో తొలిరోజే ఈస్ట్ జోన్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు సాధించింది.


