HomeNation and World'మీ కొడుకు బతికే ఉన్నాడు': దహన సంస్కారాలు చేసిన 15 రోజుల తర్వాత పంజాబ్ కుటుంబానికి...

‘మీ కొడుకు బతికే ఉన్నాడు’: దహన సంస్కారాలు చేసిన 15 రోజుల తర్వాత పంజాబ్ కుటుంబానికి పోలీసుల ఫోన్ కాల్

పంజాబ్‌లోని కపూర్తలాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన రవికుమార్ అనే యువకుడిని కాలిన మృతదేహం ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులు ఆగస్టు 13న దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే 15 రోజుల తర్వాత కపూర్తలా సెంట్రల్ జైలు నుంచి ఫోన్ రాగా.. రవికుమార్ జలంధర్ పోలీసుల అరెస్టు వల్ల జైలులోనే సజీవంగా ఉన్నాడని తెలిసి ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అది నిజమేనా అని తెలుసుకునేందుకు.. నేరుగా జైలుకు వెళ్లగా అక్కడ కొడుకును చూసి ఉబ్బితబ్బిపైపోయారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments