1 Lakh Aid For Organ Donor Families In Andhra Pradesh: అవయవదానంతో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రాలను 9కి పెంచామని.. త్వరలో 12 బోధనాసుపత్రుల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. దాతల కుటుంబాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.1 లక్షకు పెంచేందుకు ప్రతిపాదనల్ని సీఎం దగ్గరకు పంపించామన్నారు. అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. అవయవాల కొరతను అధిగమించేందుకు చట్టంలో మార్పులు తెచ్చామన్నారు.
ఏపీలో అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం.. మంత్రి కీలక ప్రకటన
RELATED ARTICLES


