హైదరాబాద్ క్యూర్ పరిధిలో పేదల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లకు నిర్మాణ అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ అనంతరం గృహ నిర్మాణ సంస్థ అధికారులు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు దరఖాస్తులు సమర్పించారు. ఆయా భూముల పత్రాలను చీఫ్ సిటీ ప్లానర్లు పరిశీలిస్తున్నారు. క్యూర్ పరిధిలో 16 ప్రాంతాల్లో తొమ్మిది, పది అంతస్తుల టవర్లుగా 7,680 ఇళ్లు నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్ కామన్ ఏరియాతో కలిపి 528.58 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


