సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిసెంబర్ నుంచి ప్రపంచస్థాయి సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు, సుమారు 180 రైళ్ల రాకపోకలు ఉండగా.. భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ సదుపాయాలను విస్తరిస్తున్నారు. బోయిగూడ బేస్మెంట్ పార్కింగ్లో 120, గణేశ్ టెంపుల్ వైపు మల్టీ లెవెల్ పార్కింగ్లో 80 చొప్పున మొత్తం 200 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని మరికొన్ని స్టేషన్లలోనూ ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.


