హైదరాబాద్లో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉన్న జీ+1 పాత అంబేద్కర్ భవనం స్థానంలో రూ.108 కోట్ల వ్యయంతో 11 అంతస్తులతో కొత్త టవర్ను నిర్మించనున్నారు. బడ్జెట్లో ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించారు. ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైన్ కోసం నిపుణుల కన్సల్టెన్సీ సేవలను తీసుకోనున్నారు. పనులను వేగంగా ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


