సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రైవేటీకరణకు ఎలాంటి ప్రతిపాదన లేదని తెలిపింది. సంస్థ 21 భూగర్భ, 17 ఓపెన్కాస్ట్ గనులతో బొగ్గు ఉత్పత్తి చేస్తోందన్నారు. నష్టాల్లో ఉన్న భూగర్భ గనులను కూడా ఉద్యోగ భద్రత, ఉపాధి దృష్ట్యా కొనసాగిస్తూ లాభదాయకంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. శాంతిఖని సంబంధించిన ఎండీవో ఈవోఐ కేవలం వ్యయ తగ్గింపు అధ్యయనం కోసం చేపట్టిన పైలట్ ప్రయత్నమన్నారు.


