దాదాపు మూడేళ్ల కిందట అక్టోబరు 7న ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ సాయుధులు.. మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 1,200 మంది అమాయకులను బలితీసుకున్నారు. అయితే, ఇటువంటి దాడికి తాజాగా, ఇరాన్ ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు నివేదించాయి. భారీ ఎత్తున ప్రాక్సీల మద్దతుతో పలువైపుల నుంచి దాడికి వ్యూహరచన చేసినట్టు జెరూసలెం పోస్ట్ వెల్లడించింది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నాయి.
ప్రాక్సీల సాయంతో ఇజ్రాయెల్పై ‘అక్టోబర్ 7’ తరహాలో భారీ దాడికి ఇరాన్ ప్లాన్
RELATED ARTICLES


