డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే డీఎస్సీ స్కాం పార్ట్-1లో పలు అంశాలను వెల్లడించామని.. త్వరలోనే డీఎస్సీ స్కాం పార్ట్-2లో కేస్ స్టడీలతో సహా మరిన్ని అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీ, మెరిట్ జాబితా, వెరిఫికేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ బయటకు వచ్చిన ఆడియోలు, వీడియోలపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


