తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, విస్తరణపై కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు కీలక నేతలు దిల్లీలో అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు, ఆమె స్థానం కొత్తవారికి అవకాశం, ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల భర్తీపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. లంబాడా, ఇతర బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


