Upcoming IPOs: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే. ఈ వారం సైతం మన భారతీయ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొననుంది. ఎందుకంటే సెప్టెంబర్ 7 నుంచి 15 తేదీల మధ్య ఏకంగా 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను ప్రారంభిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మొత్తంగా రూ. 7055 కోట్ల మేర సమీకరించనున్నాయి. వీటిల్లో ప్రముఖ కంపెనీలు సైతం ఉండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మరి ఆ పబ్లిక్ ఇష్యూల గురించిన వివరాలు తెలుసుకుందాం.


