HomeAndhra Pradeshరోడ్డెక్కిన ఉపాధ్యాయులు.. విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత.. యూటీఎఫ్ నేతల అరెస్ట్

రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.. విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత.. యూటీఎఫ్ నేతల అరెస్ట్

మంగళగిరిలోని విద్యాభవన్ ముట్టడికి యూటీఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ నేతల పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యాభవన్ ముట్టడికి యత్నించారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలంటూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లందరికీ ఒకే క్వాలిఫయింగ్ మార్కులు ఉండాలని, పరీక్ష రాసే విధానం కూడా ఆఫ్‌లైన్‌లోనే జరగాలంటూ తమ డిమాండ్లు వినిపించారు. యూటీఎఫ్ నేతల ఆందోళనకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. గంటల తరబడి రోడ్డుపై నిరసనలు చేయడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments