Andhra Pradesh Cotton Procurement 2026 Guidelines: ఆంధ్రప్రదేశ్లో పత్తి కొనుగోళ్ల కోసం మార్గదర్శకాలను (ఎస్వోపీ) ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో సిసిఐ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడతారు. ఈ-పంట నమోదు వివరాల ఆధారంగా పత్తి రైతుల్ని గుర్తిస్తారు. రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్ లేదా సిసిఐ పత్తి కొనుగోలు వ్యవస్థలో స్లాట్, సమయాన్ని ముందుగా బుక్ చేసుకోవాలి. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు.


