ఆరేళ్ల కిందట నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణాలు బాలీవుడ్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకోడానికి వారం రోజుల ముందే దిశా మరణించారు. ఆమె భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనపై తాజాగా సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించింది. ఇంది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా? లేక ఎవరి పాత్ర ఉందా? అనేది నిగ్గుతేల్చాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే దీనిని ముడిపెడుతూ ఆరోపణలు చేయడం గమనార్హం.
దిశ సాలియన్ మృతిపై సీబీఐ విచారణ.. ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
RELATED ARTICLES


