కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కొండా మురళి చేసిన ఘాటు ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమపై ఎన్ని రాజకీయ దాడులు జరిగినా దృఢంగా నిలబడతామని తేల్చి చెప్పారు. అవసరమైతే మొండిగా ఎదురెళ్లగలమని హెచ్చరించారు. ఇక.. అంతకుముందు మీడియా ముందుకు వచ్చిన కొండా మురళి.. చిరునవ్వుతో మీసం మెలేస్తూ కనిపించడం కూడా ఆసక్తిని రేకెత్తించింది.


