మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పంకి చెందిన ‘పూరి ఆర్ట్స్’ ప్రతినిధి పురుషోత్తం ఒక అరుదైన కళాఖండాన్ని సృష్టించారు. ఒక నెమలి ఈకపై మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా పెయింటింగ్ ద్వారా రూపొందించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నెమలి ఈకపై వేసిన ఈ ఆర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వినూత్న ప్రయోగాన్ని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఆర్టిస్ట్ పురుషోత్తంపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. నెమలి ఈకపై “చిరు” చిత్రం.. మెగాస్టార్ బర్త్డే విశేషాలెన్నో..
RELATED ARTICLES


