అఫ్గనిస్థాన్తో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త. గాయంతో టీమిండియాకు దూరమైన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నాడు. దీంతో మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న అఫ్గాన్తో టీ20 సిరీస్కు సిద్ధమయ్యాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడంతో అతడు న్యూఢిల్లీలో భారత జట్టుతో చేరనున్నాడు. అయితే రీహాబ్ సమయంలో కొత్తగా గాయపడటంతో యంగ్ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా ఫిట్నెస్ పరీక్ష ఫలితం రావాల్సి ఉంది.


