సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బల్వంతపూర్ గ్రామానికి చెందిన దండుగల రాజు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో కారును బయటకు తీయగా.. అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


