NPS Charges: నేషనల్ పెన్షన్ సిస్టమ్లో కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఎన్పీఎస్, ఎన్పీఎస్ లైట్ ఛార్జీలు మారుతున్నాయి. కొత్త మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచే అమలులోకి వస్తాయి. PRANఖాతాకు రూ. 200 వన్ టైమ్ ఆన్ బోర్డింగ్ ఫీజుతో పాటుగా 0.20 శాతం వార్షిక నిర్వహణ ఛార్జీలు తీసుకొస్తున్నారు. అయితే, ఈ ఛార్జీల వసూలులో చందాదారులకు వెసులుబాటు కల్పించారు. మరి ఈ కొత్త మార్పుల గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


