పశ్చిమాసియా యుద్ధం ఆరు నెలలు పూర్తి చేసుకున్న వేళ ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ గల్ఫ్ సహా ముస్లిం దేశాలకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ముస్లిం ప్రపంచం తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కనబెట్టి తమ నిజమైన శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్లను గుర్తించి ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. ముస్లిం దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే పాలస్తీనియన్లు నిస్సహాయ స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇరాన్ పౌరులు కూడా సామాజిక సమైక్యతను కాపాడుకుంటూ డాలర్ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని స్పష్టం చేశారు.
“నిజమైన శత్రువు ఎవరో గుర్తించండి”: ముస్లిం దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా లేఖ
RELATED ARTICLES


