ఢిల్లీలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. ఎయిర్పోర్ట్ పరిసరాలు నీటమునిగాయి. ఎయిర్పోర్టు లోపలికి కూడా వచ్చేసింది. ఎయిర్పోర్ట్ ఎంట్రీ గేట్ల వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్పోర్ట్ ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నీటిలోనే లగేజీ ట్రాలీలను తోసుకుంటూ ఎంట్రీ గేట్ల వైపు వెళ్తున్న వీడియోలు కూడా నెట్టింట పోస్ట్ చేశారు.
ఢిల్లీ ఎయిర్పోర్టు జలమయం.. ఐదు విమానాలు మళ్లింపు, నీటిలోనే లగేజీతో ప్రయాణికులు
RELATED ARTICLES


