ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఎన్నికల నిర్వహణ కోసం పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. సెప్టెంబర్ 11న సంబంధిత మండల పరిషత్ కార్యాలయాలలో ప్రాథమిక జాబితాలను ప్రదర్శించాలని ఆదేశించారు. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.


