Adani Group Investments: అదానీ గ్రూప్ ఇటీవలి కాలంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది. రోడ్లు, పోర్టులు, విద్యుత్, సిమెంట్, రెనివబుల్ ఎనర్జీ, డేటా సెంటర్లకు సంబంధించి దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులపై అదానీ గ్రూప్ పనిచేస్తోంది. ముఖ్యంగా కేరళ, బిహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు కీలకంగా మారుతున్నాయి.


