ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని వైసీపీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు మోహరించాలని.. పోలింగ్ రోజు మాత్రమే కాకుండా నామినేషన్ల దగ్గర నుంచి స్ట్రాంగ్ రూముల భద్రత వరకూ కేంద్ర బలగాలనే వినియోగించేలా చూడాలని లేఖలో కోరారు.
స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు మోహరించాలి.. ఎస్ఈసీకి వైసీపీ లేఖ..
RELATED ARTICLES


