మంత్రి కొండా సురేఖ రాజీనామా వార్తల నేపథ్యంలో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తే లేదా రాజీనామా చేయాల్సి వస్తే ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కొండా సురేఖకు బహిరంగంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ.. బీసీ, బడుగు బలహీన వర్గాల నాయకులను అణచివేస్తున్నారని ఆరోపించారు. బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.


