ఇంద్రకీలాద్రిపై 2026 సంవత్సారానికి గాను దసరా మహోత్సవాల షెడ్యూల్ను ఆలయ అధికారులు విడుదల చేశారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 16న సరస్వతీ దేవిగా.. అక్టోబర్ 18న దుర్గాదేవిగా, అక్టోబర్ 19న మహిషాసురమర్ధిని దేవిగా అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలిగిపోనుంది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి రోజుకో అలంకరణలో అమ్మవారు!
RELATED ARTICLES


