ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వెల్లడించారు. మరోవైపు.. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడతామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విద్య, వైద్యం కోసం 40 శాతం బడ్జెట్ కేటాయించాలని.. విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై అసెంబ్లీలో పోరాడతానని తెలిపారు.


