మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఏర్పడిన వివాదంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని.. కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్, క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలకు నాయకులు, కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు చర్చించబోనని పేర్కొన్న సీఎం.. ఊహాజనిత కథనాలపై స్పందించబోనని స్పష్టం చేశారు.


