మంత్రి కొండా సురేఖకు సంబంధించిన రాష్ట్రంలో పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. కొండా సురేఖకు చెందిన పర్యావరణ, అటవీ శాఖలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న అధికారుల డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. వారు పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం మంత్రి కొండా సురేఖకు ముందస్తు సమాచారం లేకుండానే జరిగిందన్న ప్రచారం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.


