సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని పేర్కొన్న కొండా సుస్మిత.. రేవంత్రెడ్డి, ఆయన కుటుంబమేనని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక వంటి కాంగ్రెస్ అగ్రనేతలంటే తనకు గౌరవం ఉందని తెలిపారు. సీఎం కుటుంబ అవినీతి ఆరోపణలను బయటపెడతానని కూడా హెచ్చరించారు.


