ఉత్తర్ ప్రదేశ్లోని ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య రామాలయ పరిపాలన పరిధిలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా సీఈవో నియమించేందుకు సిద్ధమైన ట్రస్టు.. బుధవారం అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ నివాసంలో జరిగే సమావేశంలో అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎంపిక కమిటీ సమర్పించిన ముగ్గురి తుది జాబితా నుంచి ఒకరిని సీఈవోగా ఖరారు చేయడంతో పాటు నూతన సభ్యుల పేర్లను కూడా వెల్లడించనున్నారు.
5,585 దరఖాస్తుల పరిశీలన పూర్తి.. అయోధ్య రామాలయ తొలి సీఈవో ఎవరో తేలిపోయేది నేడే!
RELATED ARTICLES


