నంద్యాలలో డేటింగ్ యాప్ ద్వారా యువకులను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ పరిచయంతో ఓ యువకుడిని కలుద్దామని పిలిచి, బంధించి, కత్తులు, రాడ్లతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్ దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి కత్తులు, ఐరన్ రాడ్లు, నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని కొత్త యాప్లు, నంబర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల అడిషనల్ ఎస్పీ సుస్మిత విజ్ఞప్తి చేశారు.


