అజ ఏకాదశి హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన వ్రతంగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగాలని కోరుకునేవారు రావి చెట్టు పూజ వంటి ఆచారాలను పాటిస్తారు.


