మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ వ్యాధి. మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మెదడు, వెన్నుపాము, కంటిలోని నరాల చుట్టూ ఉండే రక్షణ పొర (మైలిన్ – Myelin) పై దాడి చేయడం వల్ల ఇది వస్తుంది. దీనివల్ల మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలు చేరడంలో అంతరాయం ఏర్పడి, అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి.
సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ. పిల్లలు, వృద్ధులలో రావడం చాలా అరుదు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతరులకు వచ్చే ప్రమాదం స్వల్పంగా పెరుగుతుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు, రావడానికి కారణాలు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు ఇలా పూర్తి సమాచారాన్ని డాక్టర్ లోకేష్ బి (సీనియర్ కన్సల్టెంట్ – న్యూరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.



