దొంగతనానికి వచ్చినోడు ఆ వేంకటేశ్వర స్వామిని చూసి రెండు చేతులెత్తి దండం పెట్టేశాడు. దేవుడు ముందు ఏ దొంగతనం చేస్తాడని అందరూ అనుకుంటే.. దండం పెట్టేసి దర్జాగా ఓనర్ కుర్చీలో కాసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత చక్కగా కౌంటర్లోని డబ్బులతో పాటు షాప్లోని వస్తువులను కూడా అపహరించారు. ఇదంతా కూడా సీసీ టీవీలో రికార్డయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. ఉరవకొండ బిగ్ బజార్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దేవుడికి దండం పెట్టి.. దుకాణం మొత్తం దోచేసిన దొంగ!
RELATED ARTICLES


