గిరిజన ప్రాంత యువతకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా త్వరలోనే జీవో తెస్తామని ప్రకటించారు. ఇదే తమ ప్రభుత్వ విధానమన్న చంద్రబాబు.. అందరికీ ఆమోద యోగ్యంగా జీవో తెస్తామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో రూపొందించిన ‘సంజీవని’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గిరిజనులకు గుడ్ న్యూస్ వినిపించారు.
గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకే.. చంద్రబాబు కీలక ప్రకటన..
RELATED ARTICLES


