కరీంనగర్–వరంగల్ మధ్య ఎన్హెచ్-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.1,641 కోట్లతో నిర్మించిన 68.015 కిలోమీటర్ల రహదారి అందుబాటులోకి వస్తే 45 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఎటీఎంఎస్, 360 డిగ్రీల కెమెరాలు, వీఎంఎస్, అంబులెన్సులు, క్రేన్లతో భద్రతను పెంచుతున్నారు. 25 ప్రాంతాల్లో వర్షపు నీటి ఇంకుడు నిర్మాణాలు చేపట్టారు. గ్రానైట్, టెక్స్టైల్ పరిశ్రమలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.


