తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే కాంగ్రెస్లో లాబీయింగ్ రాజకీయాలు వేడెక్కాయి. రెండు పట్టభద్రుల, నాలుగు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి నలుగురు, ఖమ్మం–వరంగల్–నల్లగొండ స్థానానికి నలుగురు నేతలు పోటీలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నవంబర్, డిసెంబర్లో ఖాళీ కానున్న గవర్నర్ కోటా స్థానాల కోసం అయోధ్యరెడ్డి, సత్తు మల్లేశ్ పేర్లతోపాటు బస్వరాజు సారయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది.


