వైద్యులపై దాడులకు పాల్పడే నిందితులకు బెయిలు పొందే అర్హత ఎంతమాత్రమూ ఉండదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్య సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది పట్ల కనీస గౌరవం చూపని వారిని తీవ్రంగా పరిగణించాలని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఠాణే మున్సిపల్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్తో సహా పలువురు వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేశ్ మాత్రే కేసులో బాంబే హైకోర్టు తీసుకున్న కఠిన చర్యలను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది.
“వైద్యులపై దాడికి పాల్పడినవారికి బెయిలు బంద్”: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
RELATED ARTICLES


