తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను బర్తరఫ్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్ఠానానికి లేదని.. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి తనను తొలగించేలా చేశారని ఆమె సంచలన ఆరోపణలకు తెర తీశారు. తన వివరణ తీసుకోకుండా, తనతో మాట్లాడకుండా మంత్రి పదవి నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు.


