పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ‘ఎల్నినో’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.


