అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కొత్త మెనూ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు మూడేళ్ల లోపు చిన్నారులను ఒకే విధంగా చూడగా.. ఇకపై 7 నుంచి 12 నెలల పిల్లలను జూనియర్లుగా, సంవత్సరం నుంచి మూడేళ్లలోపు పిల్లలను సీనియర్లుగా చూడనున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు వారానికి రెండ్రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందజేయనున్నారు. ప్రతి వంటలోనూ మునగాకు వాడాలని ప్రభుత్వం సూచిస్తోంది. సాయంత్రం వేళ ప్రొటీన్ కోసం ఉడికించిన శనగలు ఇవ్వనున్నారు. ఈ మెనూను అందరూ పాటించాలని అధికారులు చెబుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు కొత్త మెనూ.. అబ్బో చాలా రుచులే ఉన్నాయిగా!
RELATED ARTICLES


