విజయనగరం జిల్లాలో పోలీస్ జీపు ప్రమాదానికి గురైంది. కొండకరకాం ఘాట్లో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ చనిపోయారు. ఎస్ఐ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.
విజయనగరం: పోలీస్ వాహనానికి బ్రేకులు ఫెయిల్.! కానిస్టేబుల్ మృతి
RELATED ARTICLES


